Sunday, September 2, 2007

ఓ రంగుల పావురం......

మనమందరం ఈ జీవితం లో ఎదో ఒక మలుపు లొ 'మన ' అని అనుకున్న వాళ్ళందరిని వదిలెసి,ఎవ్వరూ తెలియని చొటుకి,ఇంతకు ముందు మనమెప్పుడూ చూడని అనుభవాలకి అలవాటు పడవలసి వుంటుంది. అసలు అటువంటి ప్రదేశాలకి వెళ్ళటానికి కారణం, ఎంతొ ఎదగాలన్న మన ఆశ,ఎక్కడికొ ఎగరాలన్న మన ఆరాటం. ఈ క్రమం లో మనకెన్నో కష్టాలు, కన్నీళ్ళు. వీటన్నిటిని తట్టుకుంటేనే అక్కడ మనం నిలబడగలం.అయినా మనవాళ్ళలా మనల్ని అర్థం చెసుకునే వాళ్ళు అక్కడ లేక పొవటం, మనవాళ్ళందరూ వున్నప్పుడు వున్న ఆనందం ఇప్పుడు మనకు కనిపించకపొవటం, వీటన్నిటిని మించి మనం ఒంటరి వాళ్ళమయిపోయామన్న బాధ ఎంత లెదన్న మన మనసులకి అనిపిస్తూనే వుంటుంది.అటువంటి సమయం లో మన కంటికి పొరలు కమ్మి దూరం నుంచి కొన్ని అందాలనై చూసి మనకు అవే ఎంతొ ఆనందాన్నిస్తాయని భ్రమలొ పడి, వాటి వెనక ఆనందం కోసం పరిగెడుతూ,ఇదే నిజమిన సంతొషమని ఊహల్తొ కాలన్ని గడిపేస్తం.తీర కళ్ళు తెరిచి దగ్గర నుంచి అసస్లు నిజాన్ని చూసక, ఇంతకు ముందు మనం ఊహించుకున్నవన్ని కలలేనని,అవి నిజాలు కావని తెలిసాక, మన బాద అనుభవించే మనకొక్కరికే తెలుస్తుంది.
ఇటువంటి నేపధ్యం లొ నన్ను ఒక పావురం లాగ ఊహిస్తు నేనొక కవితో, గేయమో, నా మనసుకయిన గాయాన్ని అలనే రాశాను. రాగమేదైన కడితే పాటౌతుందేమో. అది ఇలా సాగుతుంది..........

ఆ రంగుల లొకంలో తన రెక్కలు విప్పాలని...

ఓ పావురం తహతహలాడింది.

తన మనసును పంచే నెస్తం కొసం ఎన్నొ ఆశల్తో,ఇంకెన్నొ ఊహల్తో...

తన పలుకులు తెలిపి, తొలి అడుగులు వేసింది.


తీరా ఆ తీరం చేరాక....

స్వచ్ఛమైన తన తెల్లదనం ఆ రంగుల మధ్యన శూన్యం .

వెక్కి వెక్కి ఎడ్చిన తరుణానే తెలిసివచ్చెనీ కఠిక నిజం.

ఒంటరితనాన్ని తొడుగా, కంటి ధారను యేరుగా మార్చిందీ వైనం.


అదే సమయంలో తనకు....

దూరంగా సుదూరంగా వినిపించెనేవొ తేనెల చినుకులు .

గాఢంగా నిగూఢంగా అవి నాటెనేవో ఆశల మొలకలు.

తనలాంటి రూపం తలచి, తనను తానే మైమరిచేల, సాగించెను ఊహలు.


ఆ మరు క్షణమే....

ఆశల మేడలెక్కి అకాశనికి పరుగులు తీసి ఆ పక్షిని చూసింది.

తన కలలు కరిగి, అసలు రంగులు తెలిసి గుండె చెదిరిపొయింది.

తన వారికిచ్చిన మాటను తప్పి, ఆశయాలను సమాధి చేసి...

ఒక్క మనసుకోసం వెనక్కి వెళ్ళలెక ముందుకు సాగింది.

మనసును రాయిగ మార్చింది.

ఫణిరాజ్

No comments: