ఇటువంటి నేపధ్యం లొ నన్ను ఒక పావురం లాగ ఊహిస్తు నేనొక కవితో, గేయమో, నా మనసుకయిన గాయాన్ని అలనే రాశాను. రాగమేదైన కడితే పాటౌతుందేమో. అది ఇలా సాగుతుంది..........
ఆ రంగుల లొకంలో తన రెక్కలు విప్పాలని...
ఓ పావురం తహతహలాడింది.
తన మనసును పంచే నెస్తం కొసం ఎన్నొ ఆశల్తో,ఇంకెన్నొ ఊహల్తో...
తన పలుకులు తెలిపి, తొలి అడుగులు వేసింది.
తీరా ఆ తీరం చేరాక....
స్వచ్ఛమైన తన తెల్లదనం ఆ రంగుల మధ్యన శూన్యం .
వెక్కి వెక్కి ఎడ్చిన తరుణానే తెలిసివచ్చెనీ కఠిక నిజం.
ఒంటరితనాన్ని తొడుగా, కంటి ధారను యేరుగా మార్చిందీ వైనం.
అదే సమయంలో తనకు....
దూరంగా సుదూరంగా వినిపించెనేవొ తేనెల చినుకులు .
గాఢంగా నిగూఢంగా అవి నాటెనేవో ఆశల మొలకలు.
తనలాంటి రూపం తలచి, తనను తానే మైమరిచేల, సాగించెను ఊహలు.
ఆ మరు క్షణమే....
ఆశల మేడలెక్కి అకాశనికి పరుగులు తీసి ఆ పక్షిని చూసింది.
తన కలలు కరిగి, అసలు రంగులు తెలిసి గుండె చెదిరిపొయింది.
తన వారికిచ్చిన మాటను తప్పి, ఆశయాలను సమాధి చేసి...
ఒక్క మనసుకోసం వెనక్కి వెళ్ళలెక ముందుకు సాగింది.
మనసును రాయిగ మార్చింది.
ఫణిరాజ్
No comments:
Post a Comment